బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం : భట్టి 1 y ago
TG : కృష్ణా జలాల్లో వాటాను రాబట్టేందుకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీని ఉపయోగించుకోమని గత పాలకులే చెప్పారని పేర్కొన్నారు. ఈ జలాలపై ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించామని తెలిపారు. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించామని వెల్లడించారు.